Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-12-21T11:32:56+05:30 IST

జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

శ్రీ సత్యసాయి: జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై లారీని ఆపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-21T11:32:57+05:30 IST