Share News

MLA: పాలనను మరచి కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారు..

ABN , Publish Date - May 10 , 2024 | 11:26 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మం త్రులు పాలనను మరచి కేవలం కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) అన్నారు.

MLA: పాలనను మరచి కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారు..

- మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మం త్రులు పాలనను మరచి కేవలం కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) అన్నారు. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆర్‌కేపురం డివిజన్‌ పరిధిలోని ఎన్‌టీఆర్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించి కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తల బలంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చామని అన్నారు. ప్రభుత్వంలో ఉంటేనే పనిచేయాలని ఏమీ లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడి పనిచేయించే శక్తి ప్రజలు తనకిచ్చారన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పాలకులు పాలనను గాలికి వదిలేసి కేవలం కండువాలను కప్పడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్‌ మోసపూర్తి వాగ్దానాలను ఇచ్చిందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కేసీఆర్‌ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar)ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, గ్రంథాలయ పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఆర్‌కేపురం డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెండ్యాల నగేష్‌, ఇంటూరి అంకిరెడ్డి, సాజిద్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, రిషి పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 11:26 AM