Share News

Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:09 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమేనని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhendar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలతో బీఆర్ఎస్(BRS) ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉండిపోతుందని అన్నారు.

Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్గొండ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమేనని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhendar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలతో బీఆర్ఎస్(BRS) ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉండిపోతుందని అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..


PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

"రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కష్టమే. పార్టీ నిర్మాణాత్మకంగా లేదు. గెలిచినా, ఓడినా సమీక్ష చేయలేదు. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్ అడిగినా కేసీఆర్ టైం ఇవ్వలేదు. అమిత్‌ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ చెప్పారు.నల్గొండ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అమిత్‌ని కలిశారు. అమిత్ పోటీ చేస్తే కొందరు సహకరిస్తామన్నారు. మరికొందరు పార్టీ మారుతామన్నారు. ఆ పరిస్థితుల్లో గెలవాలని అనుకోలేదు. ఓడినా గౌరవప్రదంగా ఉండాలనుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బూతులు మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో పార్టీ నష్టపోయింది. కేసీఆర్ ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది" అని గుత్తా పేర్కొన్నారు. గుత్తా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

Telangana: విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక.. ఆల్ అవుట్ లిక్విడ్ తాగి..

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 05:28 PM