Share News

AP Election 2024: ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. దద్దరిల్లుతున్న విజయవాడ.. లైవ్ అప్‌డేట్స్..

ABN , First Publish Date - May 08 , 2024 | 06:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.

AP Election 2024: ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. దద్దరిల్లుతున్న విజయవాడ.. లైవ్ అప్‌డేట్స్..

Live News & Update

  • 2024-05-08T19:05:43+05:30

    విజయవాడలో మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ రోడ్ షో

  • 2024-05-08T19:02:16+05:30

    • రోడ్ షో ప్రారంభమయ్యే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

    • చంద్రబాబుకు సాదర స్వాగతం పలికిన విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

    • పవన్ కల్యాణ్‌కి కి స్వాగతం పలికిన మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి

  • 2024-05-08T18:57:27+05:30

    • విజయవాడలోని పీవీపీ మాల్ నుంచి బెంజి సర్కిల్ వరకు మోదీ ర్యాలీ కొనసాగనుంది.

    • గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని

    • కాసేపట్లో మొదలుకానున్న ర్యాలీ

  • 2024-05-08T18:52:28+05:30

    ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు. ఏపీలో పలు బహిరంగ సభలలో పాల్గొన్న ఆయన విజయవాడలో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు.