Home » Chandrababu
ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
Andhrapradesh: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే 13వ తేదీన పోలింగ్కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు.
నేడు కాకినాడ సిటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడలో పర్యటన కోసం నెల క్రితం పర్మిషన్ అడిగినా కూడా పోలీసులు ససేమిరా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటన ఉందని పవన్కు నో చెప్పారు. రోజంతా పోలీస్ స్టేషన్లో పవన్ పర్యటనకు పర్మిషన్ కోసం మాజీ ఎమ్మెల్యే ఒకరు పడిగాపులు కాసినా కూడా ఫలితం దక్కలేదు.
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Andhrapradesh: జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముస్లిం పెద్దలు ఘనంగా సన్మినించారు.
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.
ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.
Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.