Home » JANASENA
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది.
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో నలుగురు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా.. మిగతా వారు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు. బ్యాలెట్లో మొత్తం 16 క్రమ సంఖ్యలు ఉండగా.. మొదటి1 5 అభ్యర్థులకు సంబంధించినవి, 16వ క్రమసంఖ్య నోటాను సూచిస్తుంది.
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారు తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్ కు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినా కూడా వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కసిగా మార్చుకొని ఓటుతో బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన’ నుంచి.. ‘నిన్ను నమ్మం జగన’ అనే పరిస్థితికి వచ్చారు. అడిగినందుకు ఒక్క చాన్స ఇచ్చామని.. ఐదేళ్లలో జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. పేరూరు, ..