Share News

Hyderabad: రూ.22 లక్షల నగదు స్వాధీనం..

ABN , Publish Date - May 09 , 2024 | 12:15 PM

ఎన్నికల నేపధ్యంలో భాగంగా బాచుపల్లి ఎస్‌ఓటీ, బాలానగర్‌ పోలీసులు(Bachupally SOT, Balanagar Police) సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 22 లక్షలను పోలీసులు గురువారం పట్టుకున్నారు.

Hyderabad: రూ.22 లక్షల నగదు స్వాధీనం..

హైదరాబాద్: ఎన్నికల నేపధ్యంలో భాగంగా బాచుపల్లి ఎస్‌ఓటీ, బాలానగర్‌ పోలీసులు(Bachupally SOT, Balanagar Police) సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 22 లక్షలను పోలీసులు గురువారం పట్టుకున్నారు. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌(Secunderabad) శ్రీకృష్ణనగర్‌కాలనీకి చెందిన పి.అఖిల్‌, బోడుప్పల్‌ బుద్దానగర్‌కు చెందిన శశికిరణ్‌లు తెలంగాణ గోల్డ్‌ బయ్యర్స్‌లో మార్కెంటింగ్‌ చేస్తుంటారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆయుధాలను విక్రయించడానికి యత్నిస్తున్న యువకుడి అరెస్ట్‌

గురువారం బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌ పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా టీఎస్ 09 ఈ 3522, టీఎస్ 08 జిఎల్‌1767 నెంబర్లు గల రెండు ద్విచక్ర వాహనాల్లో రూ. 22 లక్షలు లభించాయి. నగదుకు సంబందించిన ఎలాంటి పత్రాలు వారి వద్ద లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బుని స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తుననట్టు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

Read Latest Crime News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 12:15 PM