Share News

Narayana: ఆనాటి కష్టాలను ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు..

ABN , Publish Date - Mar 25 , 2024 | 09:01 AM

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. అభివృద్ధిపై, పాలనపై ప్రశ్నించిన వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రం అన్ని వర్గాల వారు జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. స్వాతంత్రానికి ముందు ప్రజలు పడ్డ కష్టాలని, మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారని విమర్శించారు.

Narayana: ఆనాటి కష్టాలను ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు..

నెల్లూరు, మార్చి 25: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ధిపై, వైసీపీ (YSRCP) పాలనపై ప్రశ్నించిన వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. స్వాతంత్రానికి ముందు ప్రజలు పడ్డ కష్టాలని, మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారని విమర్శించారు.

AP Elections 2024: ఇదేదో తేడాగా ఉందే!


యువతకు ఒక్క ఉద్యోగం లేదని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉండవని ప్రజలకు అర్ధమైందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లలో వేస్తున్నారని..‌. దుకాణాలు పగులగొడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో చేసిన ఏ అభివృద్ధి చెప్పుకోలేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు నెల్లూరులో మీసాలు మెలేస్తూ సవాళ్లు చేశారని.. వారు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పుకోలేరని మాజీ మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..

Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?

Fire Accident: పండుగ వేళ భారీ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి 34 ఫైర్ ఇంజిన్లు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2024 | 09:31 AM