Home » Andhra Pradesh
వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా...
Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.
అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు... ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్కు ముందు సంక్షేమ పథకాల బటన్ నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో..
నిన్న ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓటేయడానికి జనం పోటెత్తారు. ప్రభంజనంలా తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను ఏర్పాటు చేశారు.
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇవాళ ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్.. ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకూ క్యూ లైన్ లో ఉండి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్లో ఓటర్లు భారీగా పాల్గొనడానికి కారణం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతేనన్నారు.
Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేడు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాశి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అనంతరం అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.