Share News

TDP 42nd Foundation Day: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రబాబు ట్వీట్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:46 AM

అమరావతి: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

TDP 42nd Foundation Day: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రబాబు ట్వీట్..

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) 42వ ఆవిర్భావ దినోత్సవం (42nd Foundation Day) సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శుక్రవారం ట్వీట్ (Tweet) చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) ప్రకటించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు.

బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమైంది. తెలుగుదేశం ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుందని, తెలుగుదేశం మరోసారి మీ అందరికీ టీడీపీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రిస్‌మస్ సోదరీ, సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారు. అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు. అందుకే ఆయన యుగకర్త అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందాం’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెట్టి శుక్రవారం నాటికి 42 ఏళ్లు అయిందని నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1982 మార్చి 29 న మన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారన్నారు. ‘‘నేను తెలుగోడిని, తెలుగు బిడ్డను తెలుగుదేశమే.. నా రాజకీయ పార్టీ అని నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించారు.. కులమతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారని’’.. అన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ వార్షికోత్సవం.. సందర్భంగా నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 10:49 AM