Home » Telangana » Warangal
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే వేళ అకాల వర్షాల రూపంలో వరుణదేవుడు రైతన్నల వెన్ను విరిచాడు. గత వారం రోజులుగా అకాల వర్షాల భయంతో ధాన్యాన్ని తడవకుండా రక్షించుకుంటూ వచ్చిన రైతన్నలకు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం వారి ఆశలను వరద పాలు చేసింది. ఫలితంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పంట నేల వాలిపోగా.. వడ్లు రాలిపోయాయి.
జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా సాగయ్యే పంటలు, అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంంబధించి అంచనా ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారులు సిద్ధం చేసుకున్నారు.
జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కింద జిల్లాలో పెద్ద మొత్తంలో మొక్కలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మొక్కలను విరివిగా పెంచి రాష్ట్రమంతటా పచ్చదనం నింపాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.
సర్కారు బడులు కుదేలవుతున్నాయి. సవాలక్ష సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల్లేక చదువులు కుంటుపడు తున్నాయి. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మన ఊరు.. మన బడి కార్యక్రమం జిల్లాలో అంతంతమాత్రంగానే అమలైంది. అత్యధిక పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. మూడెళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. మరెన్నో పనులు ఇంకా మొదలే కాలేదు.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తోనే.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ దూకుడు చూపుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పకడ్బందీ వ్యూహాలతో ఈ ఎన్నికలో విజయం సాధించే దిశగా అటు ఎమ్మెల్యేలు.. ఇటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
ఒకప్పుడు జూదం అంటే ఒక ప్రాంతంలో నలుగురు చేరి డబ్బులు పెట్టి ఆడేవారు. నేటి ఆధునిక స్మార్ట్ ఫోన్ యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం పల్లెల్లోకి పాకింది. ‘ఆన్లైన్’లో బెట్టింగ్.. ఐపీఎల్ క్రికెట్, కేపీఎల్ కబడ్డీ, పేకాట, ఇతర గ్యాంబ్లింగ్ (జూదం) గేమ్లు ఏదైనా సరే యువకుల ప్రాణాలను బలిగొంటూ కుటుంబాలను నాశనం చేస్తు న్నాయి. ఒకప్పుడు విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్లైన్ జూదం ఆటలు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలతో మారుమూల పల్లెలకు చేరాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఇటు అభ్యర్థులు.. అటు ఆయా పార్టీల నేతలు హమీలు గుప్పిస్తున్నారు. ఓరుగల్లు కాకతీయుల ఏలిన మహనగరమే అయినా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సౌకర్యాలు అంతంతే. రాష్ర్టానికి రెండో రాజధాని అనే మాటే తప్ప హైదరాబాద్లో ఉన్న వసతుల్లో పైసా వంతు కూడా ఇక్కడ లేనే లేవనే చర్చ ఉంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలు, అభ్యర్థులు గుప్పిస్తున్న హామీలను ఓరుగల్లు వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు, ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
కాంగ్రెస్ దుష్ట పరిపాలనలో ఉచితబస్సు తప్ప.. ఇతర హామీలేవి అమలు కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సుయాత్ర బుధవారం సాయంత్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి రాత్రి 7.10గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.
భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మానుకోట జనసభను సోమవారం నిర్వహించారు.