Share News

KA Paul: ఈ ఎన్నికల్లో నాతో పొత్తుకు సిద్ధమా.. కేఏ పాల్ బంపరాఫర్

ABN , Publish Date - Apr 25 , 2024 | 06:15 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పలు రాజకీయ పార్టీలకు బంపరాఫర్ ప్రకటించారు. ఒక ఛానల్ నిర్వాహకులు తనను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోమని అడిగారని చెప్పారు. అయితే తాను ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు కాబట్టి పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

KA Paul: ఈ ఎన్నికల్లో నాతో పొత్తుకు సిద్ధమా.. కేఏ పాల్ బంపరాఫర్

విజయవాడ: ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పలు రాజకీయ పార్టీలకు బంపరాఫర్ ప్రకటించారు. ఒక ఛానల్ నిర్వాహకులు తనను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోమని అడిగారని చెప్పారు. అయితే తాను ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు.. కాబట్టి పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ తనతో పొత్తు పెట్టుకోవాలంటే ఎవరైనా తనతో కలిసి రావచ్చని బంపరాఫర్ ఇచ్చారు.


AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్

విశాఖపట్నం ప్రజలు తనను కోరుకుంటున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయని.. లేకపోతే ఆ రాజకీయ దొంగలు మీ కిడ్నీలు కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. గురువారం నాడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్‌ని అమ్మాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూస్తున్నారని విరుచుకుపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టు నుంచి స్టేట‌స్ కో తెచ్చానని గుర్తుచేశారు.


మూడేళ్లుగా భూములను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ భూమిని ఇప్పటికే అమ్మేశారని మండిపడ్డారు. 2017లో గంగవరం పోర్టుకు సంబంధించిన రూ.65 వేల కోట్ల షేర్లను రూ. 600 కోట్లకు అమ్మేశారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా స్టేటస్‌ కో తీసుకువచ్చానని తెలిపారు.


రాజకీయంలో డబ్బు పంచితేనే రాజకీయ పదవులు వస్తాయని అంటారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి భరత్ డ్రగ్స్‌లో ఇరుక్కున్నారు కాబట్టి గెలవలేరన్నారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో తనను ఓడించేంతా దమ్ములేదని అన్నారు. ఏపీని అమెరికాలా అభివృద్ధి చేసే సత్తా తనకి మాత్రమే ఉందన్నారు. తనకు భయపడి తన పార్టీ గుర్తు మార్చేసి కుండ గుర్తుని ఇచ్చారని కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 06:20 PM