Home » Andhra Pradesh
తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందన్నారు. చాలా కాలం తరువాత పోలీసులు వారు సక్రమంగా విధులు వారు నిర్వర్తించారన్నారు.
పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్కు విహార యాత్రకు వెళ్లారు.
సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.
వైసీపీ నేతల అక్రమాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాతో పాటు డ్రగ్స్కు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చేశారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరో అక్రమానికి తెరలేపారు.
చినుకు పడిందంటే రైతులకే కాదు.. మరికొందరికి కూడా ఆనందమే. అక్కడి ప్రజలు వరుణుడి కరుణ కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వరుణుడి రాక తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని ఆశగా ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ వారెవరంటారా? కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు.
కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ భీభత్సం.. వేగంగా దూసుకెళ్లి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లి్ంది. బట్టల షాపు రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బట్టల షాపు, ఇల్లు ముద్దనూరులో విలేకరిగా పని చేస్తున్న చలపతిగా గుర్తించారు.
జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వేల కోట్లు కుమ్మరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. రెండవ సారి సస్పెన్షన్ను క్యాట్ కొట్టివేసింది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబీ ఇచ్చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్ను ఎలక్షన్ కమిషన్కు పంపాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ (శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిలిస్) అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు.