Share News

AP Elections: కృష్ణా జిల్లాలో 90.16 శాతం పోలింగ్

ABN , Publish Date - May 04 , 2024 | 10:08 PM

సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) అంతర్భాగంగా ఉమ్మడి కృష్ణా (Krishna) జిల్లా వ్యాప్తంగా ఈనెల 4, 5, 6 తేదీల్లో మూడురోజుల పాటు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballots) ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

AP Elections: కృష్ణా జిల్లాలో 90.16 శాతం పోలింగ్

కృష్ణా జిల్లా, ఆంధ్రజ్యోతి: సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) అంతర్భాగంగా ఉమ్మడి కృష్ణా (Krishna) జిల్లా వ్యాప్తంగా ఈనెల 4, 5, 6 తేదీల్లో మూడురోజుల పాటు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballots) ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. కాగా జిల్లాలో తొలి రోజు 90.16 శాతం మేర పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలింగ్ జరిగింది. తొలి రోజు పోస్టల్ బ్యాలెట్‌ను పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 3,728 మందికిగాను 3,361 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. గన్నవరంలో 299, గుడివాడలో 490, పెడనలో 212, మచిలీపట్నంలో 783, అవనిగడ్డలో 843, పామర్రులో 246, పెనమలూరులో 488 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారని కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఆది, సోమవారాల్లో కూడా ఇతర ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు.

Krishna-District-1.jpg

Read Latest Andhra Pradesh News and Telugu News


Updated Date - May 04 , 2024 | 10:09 PM