Home » National
వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఓ పక్క జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.
"మా పార్టీకి ఓటేయకపోతే మీ కరెంట్ కట్ చేస్తాం" ఇదీ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) ఓటర్లను బెదిరించిన తీరు. తీవ్ర వివాదాస్పదమైన ఆయన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో రాజకీయ వేడిని రాజేశాయి.
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు.
సార్వత్రిక ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున తాత్కాలిక ఉపాధి అవకాశాలనూ కల్పిస్తున్నాయి.
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది గోల్డీ బ్రార్(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ ఇంటి వద్ద ఇటీవలే కాల్పులకు పాల్పడిన ఘటనలో పలువురిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.