Share News

AP Elections: ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్

ABN , Publish Date - May 06 , 2024 | 10:35 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు.

AP Elections: ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్

పల్నాడు, మే 6: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy) మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ (YSRCP) విడుదల చేసిన మేనిఫెస్టోలో (Manifesto) రైతులకు (Farmers) ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు. అసలు రైతులను ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదని ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.

Loksabha polls 2024: బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే.. రఘురాంరెడ్డి ఫైర్


మేనిఫెస్టోలో ఉత్తుత్తి హామీలతో జగన్ రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌కు రైతులను ఓటు అడిగే అర్హత లేదన్నారు. రైతులను వడ్డీ వ్యాపారుల పాలు చేసింది కాక దొంగప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రైతులకు ఇస్తానన్న సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి జగన్ అని నిలదీశారు. సున్నా వడ్డీ రుణాలపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. ఐదేళ్లలో రైతులకు రూ.26 వేల కోట్లు ఎగ్గొట్టిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. ఐదేళ్లలో సున్నా వడ్డీకి ఇచ్చింది కేవలం రూ. 848 కోట్లు అని తెలిపారు. ఇక రైతులకు ఇస్తానన్న పావలా వడ్డీకి మంగళం పాడిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అంటూ ప్రత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి...

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

YSRCP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ నేతల డబ్బు ఎర.. అదేంటని ప్రశ్నిస్తే..

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 01:23 PM