భారత్-పాక్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్!

 భారత్-పాక్ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు

 కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.

చిరంజీవి పెవిలియన్‌లో కూర్చుని ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ టీవీ స్క్రీన్‌పై పలుసార్లు కనిపించారు.

మరోవైపు మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, నటుడు సన్నీ డియోల్ కలిసి టీవీలో మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. 

 ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే.

టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగింది