చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. 100 మంది ఉద్యోగాలు ఉష్

చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వర్తించేందుకు నిరాకరించడంతో 100 మంది పోలీసులపై పాకిస్థాన్ ప్రభుత్వం వేటు వేసిందని తెలుస్తోంది. 

డ్యూటీకి హాజరు కాకపోవడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. 

గడాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే హోటల్స్ వరకు ప్లేయర్లకు భద్రతగా ఉండేందుకు పోలీసులను కేటాయించారట. 

డ్యూటీ వేసినా కొందరు హాజరుకాకపోవడంతో వేటు వేశామని పంజాబ్ ప్రావిన్సు ఐజీపీ ఉస్మాన్ అన్వర్ వెల్లడించారు.

సుదీర్ఘ పనిగంటలతో అలసట, ఒత్తిడికి గురవుతుండటం వల్లే పోలీసులు విధులకు హాజరు కాలేదని తెలుస్తోంది. 

టోర్నీ లీగ్ దశ నుంచే పాక్ టీమ్ ఇంటిదారి పట్టడమూ డ్యూటీ అటెండ్ కాకపోవడం వెనుక ఒక రీజన్ అని సమాచారం.