కార్తీక మాసంలో దీపారాధన అత్యంత పవిత్రమైనది

దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు

అయితే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

ఈ దీపారాధనలో ఉపయోగించే 365 వత్తులు సంవత్సరంలోని అన్ని రోజులను సూచిస్తుంది

భక్తులు సంవత్సరం పొడవునా ప్రతి రోజూ ఆలయానికి వెళ్లి దీపారాధన చేసినంత మహా పుణ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు

భక్తుల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు

ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి