శ్రావణ మాసం మొదలైంది.  ఇది లక్ష్మీదేవికి  ప్రీతికరమైన నెల.

ఈ మాసంలో లక్షి పూజ చేస్తే సిరిసంపదలు వస్తాయని నమ్ముతారు.

ఇంటిని శుభ్రపరచుకొని, ద్వారబంధం వద్ద దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ రోజు శుక్రవారం కావడంతో మొదటి శ్రావణ శుక్రవారం పూజకు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ పూజను శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ అంటారు.

కొత్త ఉప్పు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి, దీపారాధన కోసం ఉపయోగించవచ్చు. ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు వత్తులను వెలిగించాలి.

పసుపు, పచ్చకర్పూరం, జావాయి పౌడర్, ఒక పువ్వుతో నీటిని నింపిన ఒక గాజు గ్లాసును పూజామందిరంలో ఉంచడం మంచిది. దీని వల్ల మంచి సువాసన వస్తుంది.