ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి..  ఈ పేరే ఎందుకు పెట్టారు..

‘ఆపరేషన్‌ సింధూర్‌’.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి.

ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు.

 ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్‌ మరణించాడు. 

 అతడిని పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. 

భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిపేసింది. 

ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. 

ఇందుకు ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో పాకిస్తాన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.