ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి..
ఈ పేరే ఎందుకు పెట్టారు..
‘ఆపరేషన్ సింధూర్’.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు.
ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు.
అతడిని పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు.
భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిపేసింది.
ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు.
ఇందుకు ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Related Web Stories
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు..
పీఎం నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ( 21-04-2025) సోమవారం మృతి చెందారు.
ఈ దేశాలతో యుద్ధం అంటే భయపడాల్సిందే..