పాక్‌ ఉగ్రస్థావరాలపై  భారత్ మెరుపు దాడులు..

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. 

ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. 

మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది.

అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం.

ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది.

కాగా భారత సైన్యం దాడులను పాకిస్థాన్‌ సైన్యం నిర్ధారించింది.