రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదని కేటీఆర్ మండిపడ్డారు.
కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని కేటీఆర్
ఆవేదన వ్యక్తం చేశారు
రేవంత్ ప్రభుత్వం అడిగినట్లుగా రైతులు ఆధార్ కార్డులు ఇచ్చారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అయినా అన్నదాతలకు కనీసం బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రవ్యా
ప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఉంద
ని కేటీఆర్ తెలిపారు.
ఈ లోటు ఎందుకుందో రైతులకు రేవంత్ ప్రభుత్వం వివరించాలని కేటీఆర్ కోరారు.
రూ.266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ధరల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
ఎరువులు ఎందుకు పెరిగాయో రైతులకు చెప్పాలని కేటీఆర్ అన్నారు.
ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తోంది ఎవరని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో చెప్పాలని కేటీఆర్ అన్నారు.
ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Related Web Stories
అప్పటివరకు బతుకుతా.. దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు!
కోడి ఈ దేశానికి జాతీయ పక్షి అని మీకు తెలుసా?
పట్టువిడవని పుతిన్.. ట్రంప్తో ఆటాడుకుంటున్నారు!
భారత్కు అమెరికా వార్నింగ్.. పన్నుల మోత తప్పదంటూ..!