ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు భారీగా ఈ ముగ్గుల పోటీలకు తరలివస్తున్నారు.

రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేస్తూ సత్తా చాటుతున్నారు.

ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు, బహుమతులు గెలుచుకునేందుకు మహిళలు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు.

పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా పెద్దఎత్తున యువత పోటీలకు తరలివస్తున్నారు.

రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆంధ్రజ్యోతి తరఫున ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేస్తున్నారు.

ముగ్గుల పోటీల సందర్భంగా చిన్నారులు, మహిళలు, వృద్ధ మహిళలు సైతం నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.