రోజుకు 3 లీటర్ల నీరు తాగితే  ఏం జరుగుతుంది..?

రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. 

రోజుకు తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 

రోజుకు తగినంత నీరు తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తగ్గుతుంది. 

డీహైడ్రేషన్ కారణంగా వచ్చే తలనొప్పి, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. 

వ్యాయామం తర్వాత మంచినీళ్లు తాగితే శరీరానికి మరింత పవర్, ఎనర్జీ వస్తుంది. 

తగినంత నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

రోజులో తగినంత నీరు తాగడం వల్ల మీ కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది. 

రోజుకు ఎంత నీరు తాగాలనేది ప్రాంతం, బాడీ సైజ్, డైట్, వాతావరణాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. 

మరీ ఎక్కువగా నీరు తాగితే రక్తంలోని సోడియం స్థాయిలు తగ్గి ప్రాణాంతక సమస్యలు కూడా రావొచ్చు.