ఈ టిఫిన్స్ ఎక్కువ తింటే.. ఆరోగ్యానికి ప్రమాదమే.. 

భారతీయులు ఎక్కువగా తినే కొన్ని రకాల టిఫిన్స్ ఆరోగ్యానికి హానికరం. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. 

ఉదయాన్నే ఆలూ కూరతో పాటు పూరీ తినడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ పేరుకుపోతుంది. శరీరాన్ని క్యాలరీలతో నింపేస్తుంది. 

మన దేశస్తులు ఎక్కువగా తినే స్నాక్ అయిన సమోసాను రిఫైండ్ చేసిన మైదాతో, ఆయిల్‌తో తయారు చేస్తారు. సమోసా జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. 

త్వరగా రెడీ అయిపోయే నూడిల్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయి. 

ఉత్తరాదిన ఎక్కువ మంది తినే చోలే బతురేలో ట్రాన్స్ ఫ్యాట్స్‌, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. 

రిఫైండ్ చేసిన మైదాతో తయారు చేసే ఆలూ పరాటా కూడా పూర్తిగా క్యాలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్‌ను కలిగి ఉంటుంది.

నూనెలో డీప్ ఫ్రై చేసే మైదా పిండి బోండాలు ఎన్నో అనారోగ్యాలను తీసుకువస్తాయి. 

మోతాదుకు మించి తెల్లని ఇడ్లీలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.