పల్లీలను ఎక్కువగా తింటున్నారా?.. ఈ సమస్యలతో జాగ్రత్త..
శనగ పలుకులను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే తరచుగా తినడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి.
పల్లీలలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.
పల్లీలలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను ఏర్పరచవచ్చు.
పల్లీలోను అమితంగా తినడం వల్ల శరీరంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
శనగ పలుకులలో కొన్నిసార్లు అఫ్లోటాక్సిన్స్ అనే ప్రమాదకర సమ్మేళనాలు కలిసి కాలేయ వ్యాధికి కారణమవుతాయి.
శనగ పలుకులకు ఉప్పు కలిపి వేయించి తినడం ప్రమాదకరం. శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగిపోయి రక్తపోటు ముప్పు మొదలవుతుంది.
పల్లీలలోని కొన్ని రకాల కొవ్వులు చర్మంపై దద్దుర్లు, ఆక్నేకు కారణం కావచ్చు.
పల్లీలను ఎక్కువగా తీసుకుంటే పలు అలెర్జీలు మొదలవుతాయి.
పల్లీలలో ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మోతాదుకు మించి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
Related Web Stories
ఇలా చేస్తే మీ ముఖం మారాల్సిందే..
కాకరకాయ రసంతో మీ జట్టు ఒత్తుగా పెరుగుతుంది
బాదం నూనె యొక్క అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు
మందారం అనగానే గుర్తొచ్చేది వతైనా కురులు, కానీ దీనికి బాగా ఉపయోగపడుతుంది