కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది?

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత సోమరిగా, నిద్ర రావడం మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా?

భోజనం తర్వాత నిద్రపోవడాన్ని "పోస్ట్‌ప్రాండియల్ సోమ్నోలెన్స్" అంటారు. దీనిని ఫుడ్ కోమా అని కూడా అంటారు.

తిన్న తర్వాత అలసట, నిద్రలేమికి కారణమయ్యే సాధారణ శారీరక ప్రతిస్పందన. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత శరీరం జీర్ణక్రియపై దృష్టి పెడుతుంది.

 కడుపు, ప్రేగులకు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి అదనపు రక్తం, ఆక్సిజన్ అవసరం., దీనివల్ల మెదడుకు తక్కువ శక్తి మిగులుతుంది.

ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే భోజనం తిన్న తర్వాత ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రను ప్రేరేపించే హార్మోన్లను పెంచుతుంది.

తిన్న తరువాత పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది శరీరాన్ని రెస్ట్ మోడ్‌లోకి తీసుకువస్తుంది. నిద్రను ప్రేరేపిస్తుంది.

భోజనం తర్వాత నిద్ర రావడం సాధారణమే, కానీ సమతుల్య ఆహారం, సరైన అలవాట్లు దానిని నియంత్రించగలవు.