కీరాతో నోరూరించే  కమ్మని పరోటా..

ముందుగా మిక్సీలో దోస ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి రుబ్బుకోవాలి. 

ఒక లోతైన పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి అందులో గోధుమపిండి, ఉప్పు, శనగపిండి, వాము, జీలకర్ర పొడి, 

పసుపు, పంచదార బాగా కలిపి ఒక టీ స్పూను నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి. 

పిండి తక్కువైతే మరికొంత కలుపుకోవచ్చు. 

 ఈ ముద్దని పావుగంట పక్కనుంచాలి.

తర్వాత కొంత కొంత పిండిని తీసుకొని మీకు ఇష్టమైన ఆకారంలో పరాటాలు చేసుకుని

పెనంపై నూనె లేదా నెయ్యితో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఇవి నిమ్మ, టమోటా పచ్చడితో బాగుంటాయి.