యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు

హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు.

 తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు.

ఆ క్రమంలో గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని సుందరీమణులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.

ఆలయం లోపలకి వస్తున్న సుందరీమణులు ఆలయం ధ్వజస్తంభం వద్ద స్వామి వారికి సమస్కారిస్తున్న సుందరీమణి

ఆలయం వద్ద స్వాగతం పలుకుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

సుందరీమణులకు కండువా ప్రదానం చేసిన ఆలయ అర్చకులు''

ఆలయ పరిసర ప్రాంతాలను వాహనంపై పరిశీలిస్తున్న దృశ్యం

స్వామి వారి సన్నిధిలో దీపారాధనకు నమస్కరిస్తున్న సుందరీమణులు