ముందుగా, ఒక గిన్నెలో శుభ్రం చేసిన చేప ముక్కలను తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి 15-20 నిమిషాలు మసాలాలు పడనివ్వండి.

తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులో నూనె వేసి వేడి చేసుకోండి.

 వేడి నూనెలో చేప ముక్కలను వేసి తక్కువ మంట మీద బాగా వేపండి. రెండు వైపులా బంగారు రంగులో వేగాక, చేపలు తీసి పక్కన పెట్టండి.

కడాయిలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు వేసి, తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి.

ఉల్లిపాయలు పసుపు రంగులో మారిన తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని పచ్చివాసన పోయేంత వరకు వేగించండి.

ఇప్పుడు ఎర్ర గోంగూర వేసి బాగా మగ్గించాలి.

గోంగూర మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి, టమోటా పేస్ట్ వేసి ఉడికించాలి.

టమోటా పేస్ట్ బాగా ఉడికిన తర్వాత 1 ½ గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి.

ఈ మసాలా రసంలో ముందుగా వేపిన చేప ముక్కలను వేసి, తక్కువ మంటపై 15-20 నిమిషాలు ఉడికించండి.

చేపలు బాగా ఉడికిన తరువాత, కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.

చేపలు బాగా ఉడికిన తరువాత, కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.