ఉప్పాడలో ఎగిసిపడుతున్న అలలు..

ఆంధ్ర‌ప్రదేశ్‌లోని కాకినాడకు సమీపంలో మొంథా తుపాన్ తీరాన్ని తాకింది.

కృష్ణా జిల్లాలోని గుడివాడలో తుఫాను ప్రభావంతో భారీ గాలులతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి.

కాకినాడ జిల్లా ఉప్పాడ తుఫానుకు సముద్రపు అలలు రాళ్ల ఢీకొని రోడ్లపైకి ఎగసిపడుతున్న దృశ్యాలు.

కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్  వెల్లడించారు.

గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నానికి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు.

పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పడుతోందన్నారు.

కృష్ణాజిల్లా వ్యాప్తంగా  బలమైన ఈదురు గాలులు.