వెండి పట్టీలు నల్లబడటం  అనేది ఒక సాధారణ విషయం.

మీ వెండి పట్టీలను మెరిపించడానికి, రాతిఉప్పు, నిమ్మరసం యొక్క మిశ్రమాన్ని ఉపయోగించండి.

 ఒక పాత్రలో కాస్త రాతి ఉప్పు వేసి దానికి తగినంత నిమ్మరసం కలపండి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో పట్టీలపై రుద్దండి. కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, ఆరబెట్టండి.

వెండి కాళ్ళ పట్టీలను మెరిసేలా చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించడం ఒక ప్రభావవంతమైన మార్గం

బేకింగ్ సోడా , నీటిని పేస్ట్ లా చేసి, దానిని పట్టీల మీద అప్లై చేసి, సున్నితంగా రుద్దండి.

కొన్ని నిమిషాల తర్వాత నీటితో కడిగి బాగా ఆరబెట్టండి. ఇలా చేయడం ద్వారా పట్టీలు తెల్లగా మెరిసిపోతాయి.

శనగపిండి, పసుపు మిశ్రమం వెండి పట్టీలను మెరిసేలా చేయడానికి ఒక సహజ నివారణ

ఈ మిశ్రమాన్ని రంగు మారిన పట్టీలపై రాసి కొంత సమయం అలాగే ఉంచి, ఆపై నీటితో కడిగి శుభ్రం చేయాలి.