బిర్యానీ తిన్న వెంటనే ఇవి తింటే డేంజర్!

రుచికరమైన బిర్యానీ స్పైసీగా ఉండటమే కాకుండా నూనెగా ఎక్కువ. కాబట్టి, దీన్ని తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తినకపోవడం మంచిది.

బిర్యానీ తిన్న తర్వాత సోడా, కూల్ డ్రింక్స్ తాగడం మానుకోండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ గ్యాస్, ఉబ్బరానికి కారణమవుతాయి.

బిర్యానీ తిన్న వెంటనే ఖీర్, రసమలై, ఐస్ క్రీం వంటి తీపి వంటకాలు తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

నారింజ, నిమ్మకాయలు, పుచ్చకాయ వంటి పండ్లు కూడా తినకూడదు. ఇవి కడుపు నొప్పిని కలిగిస్తాయి.

బిర్యానీ తిన్నాక మిల్క్ షేక్స్, పాల ఉత్పత్తులు తినకూడదు. ఇవి కడుపులో ఆమ్లతత్వాన్ని పెంచుతాయి.

బిర్యానీ తిన్న తర్వాత ఊరగాయలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి.

కొంతమంది బిర్యానీ తిన్న వెంటనే కాఫీ లేదా టీ తాగుతారు. అలా చేయడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి.

బిర్యానీ తిన్న తర్వాత సోంపు తినవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా మజ్జిగ కూడా తాగవచ్చు.