మన ఇండియాలో నాన్ వెజ్  ఎక్కువగా ఎవరు తింటున్నారో తెలుసా?

 భారతదేశంలో మాంసాహారుల సంఖ్య ఎక్కువగా ఉంది. చేపలు, మాంసం తినడానికి ఇష్టపడే వారి సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువ.

 భారతదేశంలో 85 శాతానికి పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారని తాజా సర్వేలో వెల్లడైంది.

అధ్యయనం ప్రకారం, భారతదేశంలో అత్యధిక మాంసాన్ని వినియోగించే రాష్ట్రం నాగాలాండ్. ఈ రాష్ట్రంలో 99.8 శాతం మంది ప్రజలు నాన్ వెజ్ తింటారు.

పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 99.3 శాతం మంది నాన్ వెజ్ తింటారు.

కేరళలో 99.1 శాతం మంది మాంసాహారం తింటారు.

తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర నాలుగో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 98.25 శాతం మంది మాంసం తింటారు.

తమిళనాడు ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ 97.65 శాతం మంది నాన్ వెజ్ తింటారు

ఒడిశా రాష్ట్రం ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 97.35 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు.