ద్రాక్ష పండ్లను  ఇలా తినాలని తెలుసా..

ముందుగా ద్రాక్షపండ్లను గుత్తి నుంచి వేరు చేయాలి. మెత్తగా ఉండి చెడిపోయినవాటిని ఏరివేయాలి.

వెడల్పాటి గిన్నెలో సగానికి పైగా గోరువెచ్చని నీళ్లు పోయాలి. 

ఇందులో రెండు చెంచాల ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా వంటసోడా వేసి బాగాకలపాలి. 

తరవాత ద్రాక్షపండ్లు వేసి మెల్లగా రుద్దుతూ కడగాలి. 

రెండు నిమిషాలు అలాగే ఉంచాలి.

తరువాత ఈ నీళ్లు తీసివేసి మంచినీళ్ళు పోసి మరోసారి కడగాలి. 

పలుచని గుడ్డమీద ద్రాక్షపండ్లు  వేసి తడి ఆరనివ్వాలి.  ఇలా శుభ్రం చేసిన తరవాతనే ద్రాక్షపండ్లను  పిల్లలక తినిపించాలి.