ఇలా చేస్తే చపాతీలు  మృదువుగా వస్తాయి.

ముందుగా గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత కొంచెం నూనె లేదా నెయ్యి వేసి పిండి మొత్తానికి పట్టించాలి. 

కొన్ని పాలు, కొన్ని నీళ్లు చిలకరిస్తూ పిండిని మెత్తని ముద్దలా చేయాలి. పిండి ముద్ద పగుళ్లు లేకుండా నున్నగా రావాలి.

దీనిమీద మూత పెట్టి కనీసం పావుగంట నాననివ్వాలి. చపాతీలు పామేముందు కూడా పిండిని వేళ్లతో నొక్కుతూ మరో పది నిమిషాలు గట్టిగా కలపాలి. 

అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి. పిండిని మరీ చల్లని నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీళ్లతో కలిపితే చపాతీలు మృదువుగా వస్తాయి.

చపాతీని పామేటపుడు పొడి పిండిని ఎక్కువగా చల్ల వద్దు. ఒకవేళ చపాతీ మీద పిండి ఎక్కువైందని అనిపిస్తే తడి బటతో తుడిచేయాలి. 

చపాతీలను మరీ సన్నగా పామకూడదు.

చపాతీలను పెద్ద మంట మీద కాల్చకూడదు. మధ్య స్థాయి మంట ఉండేలా చూసుకోవాలి.

పెనం బాగా వేడిగా అయ్యాకనే దాని మీద చపాతీలు కాల్చాలి. పెనం వేడిగా లేకపోతే పాతీలు గట్టిగా వస్తాయి.

చపాతీ సగానికి పైగా కాలిన తరువాతనే దాని మీద నూనె రాయాలి. పెనం మీద ముందుగా నూనె వేస్తే చపాతీలు సరిగా కాలవు.

చపాతీలను రెండువైపులా కాల్చిన తరువాత పళ్లెంలోకి తీసి దాని మీద మూత పెట్టాలి. లేకుంటే గట్టిపడతాయి.