అరటి పండుతో ఇలా ట్రై చేయండి..  ఏ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు..

 అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాకుండా ఈ పండు చర్మానికి కూడా మంచి చేస్తుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చర్మాన్ని మెరుసేలా చేస్తుంది.

 రెండు అరటిపండ్ల తొక్క తీసి దానిని మెత్తని ముద్దగా చేయాలి.

దీనికి ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. 

తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసుకుని 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అరటిపండు, దోసకాయ, కొన్ని బొప్పాయి పండు ముక్కలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. 

ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసుకోని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

చర్మానికి అవసరమైన  తేమను ఈ ప్యాక్ అందిస్తుంది.

 ముఖంపై ఉన్న మచ్చలు పోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.