వేసవికాలం వచ్చినప్పుడు  చలువ కోసం  పండ్లు తినడం సహజం

ముఖ్యంగా కర్భూజ చాలా మందికి ఇష్టమైన పండు.

వేసవిలో దాహాన్ని తీరుస్తుంది.ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేడిని తట్టుకునే శక్తిని అందిస్తుంది.

ఆరోగ్య సమస్యలు ఉన్న కొంతమంది వ్యక్తులు కర్భూజను తినకుండా దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 ప్రత్యేక పరిస్థితుల్లో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది

ముఖ్యంగా డయాబెటిస్,కిడ్నీ సమస్యలు,చర్మ సంబంధిత అలర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును మితంగా తీసుకోవాలి

ఈ పండు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తినడం ఉత్తమం.

డయాబెటిస్‌ ఉన్నవారు కర్భూజను ఎక్కువగా తినకూడదు.నిపుణుల మాట ప్రకారం ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 60-80 మధ్య ఉంటుంది.

దీన్ని అధికంగా తీసుకున్నట్లయితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోవచ్చు.డయాబెటిస్‌ ఉన్నవారు దీన్ని తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.