బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా..  రోజూ మూడుసార్లు ఇలా చేస్తే.. 

డయాబెటిస్‍‌తో బాధపడేవారు రోజూ బిర్యాని ఆకును మూడుసార్లు వాడితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

ఓ పాత్రలో 10 బిర్యానీ ఆకులు వేసి, మూడు గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.

నీళ్లు మరిగాక స్టవ్ దించేసి మూడు గంటల పాటు చల్లారనివ్వాలి. దీనివల్ల బిర్యాని ఆకులో ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి.

తర్వాత ఆకులను తొలగించి రోజూ సగం గ్లాసు చొప్పున మూడు రోజుల పాటు కషాయాన్ని తాగాలి.

ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఈ కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మూడు రోజుల తర్వాత రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా మూడు రోజుల పాటు తీసుకోవాలి.

కషాయం తీసుకోవడంతో పాటూ వ్యాయామం చేయడం, చిరు ధాన్యానలు తీసుకుంటూ ఉంటే షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

డయాబెటిస్ తీవ్రతను బట్టి ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.