కొందరికి రాత్రిళ్లు 10 గంటల పాటు నిద్రపోయినా పగటి పూట నిద్రమత్తుతో తూగుతూ ఉంటారు.

మరికొందరికి రాత్రి 4 గంటల నిద్ర దొరికినా సరిపోతుంది. మరుసటి రోజంగా చలాకీగా ఉంటారు. 

ఇలా ఎందుకో శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్యుపరమైన మార్పులే ఈ పరిస్థితికి కారణమని వివరించారు.

ఈ జన్యుమార్పు కారణంగా కొందరిలో జీవగడియారంలో పెద్ద మార్పే వస్తుందట.

ఫలితంగా వారి నిద్ర స్వల్ప సమయమైనా మంచి నాణ్యతతో గాఢ నిద్రగా ఉంటుందట.

రోజూ కేవలం 4 గంటలు నిద్రపోవడం ప్రమాదకరం, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

 మంచి ఆరోగ్యం కోసం రాత్రికి 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి.