అరటి పండు పరగడుపున తినకూడదా..!

పరగడుపునే అరటిపండ్లను తినడం వల్ల ఇబ్బందులు తప్పవా.. అదే తెలుసుకుందాం.

నిజానికి అరటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.

అరటిపండ్లలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.

కొన్నిసార్లు కడుపు నొప్పి,. వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

  ఒక మీడియం అరటిపండు తింటే 25 నుండి 30 గ్రాముల కార్బోహైడ్రట్లు, 90 నుంచి 105 కేలరీలు అందుతాయి.

ఉదయం కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అరటిపండును తినవచ్చు.

ఈ సమయాల్లో తినడం వల్ల శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.