అతిగా ఆహారం తీసుకుంటే ఇన్ని నష్టాలున్నాయా?..

ఆహారం అతిగా తీసుకుంటే ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకునే ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 

ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్‌, నాన్‌ గ్యాస్ట్రోఎంటరైటిస్‌ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి.

ఆహారం కలుషితమైతే అక్యుట్‌ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కు దారితీస్తుంది. 

దీని వల్ల వాంతులు, విరోచనాలు రావడమే కాక కాలేయం పనితీరు దెబ్బతింటుంది. 

హైపటైటిస్-ఎ, హైపటైటిస్-సి, వైరల్‌ ఫీవర్‌ వంటివి దరిచేరుతాయి. 

దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ఫ్యాటీ లివర్‌, అధిక బరువు సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతాయి.