నాన బెట్టిన పల్లీలు నెల రోజుల పాటు తింటే..

పల్లీల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు పోషకాలు ఉంటాయి. 

నానబెట్టిన వేరుశెనగలు తింటే తక్షణ శక్తి అందుతుంది.

వీటిలో పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. 

పరగడుపున నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల కండరాలను టోన్ చేయడానికి, కండరాల క్షీణతను నివారించడానికి సహాయపడతాయి.

ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

వీటిలో విటమిన్ ఈ, సీ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి జుట్టుతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి.

పల్లీలు నానబెట్టి తీసుకోవడం వల్ల కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సంవృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.

ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.