ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.

నరాల పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అజీర్ణం, కడుపులో ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం లాంటివి తగ్గుతాయి.

రాత్రిపూట శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయి.

గొంతులో గర గర, ముక్కు దిబ్బడ, జలుబు లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నెలసరి సమయంలో వేడి నీరు తాగడం వల్ల కడుపునొప్పి, అలసట, నీరసం, విసుగు లాంటి సమస్యలు తగ్గుతాయి.

నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఒత్తిడి తగ్గి సమస్య తీరుతుంది.