రోజు రోజుకు కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి. 

పేద మధ్య తరగతి కుటుంబాలు కూరగాయాలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వందలు ఖర్చు పెట్టి ఇంటికి తెచ్చిన కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. చాలా త్వరగా పాడైపోతున్నాయి.

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటిన ఈ సమయంలో ఎండ బెట్టిన కూరగాయలు మంచి ఆప్షన్ అవుతాయి. 

ఎండబెట్టిన కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాదు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందిస్తాయి. 

ఎండబెట్టిన కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 

ఎండబెట్టిన కూరగాయల్లో వేస్టేజ్ అన్న ప్రసక్తి ఉండదు. 

ప్రతీ కూరలోకి వాటిని వాడుకోవచ్చు. స్నాక్స్‌లాగా కూడా తినవచ్చు.