చింతపండుతో రసం, చారు,  పులిహోర చేస్తుంటాం.

చింతపండు సౌందర్య పోషణలోనూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు

చింతపండు గుజ్జును కొద్దిమొత్తంలో తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, చెంచా పంచదార, అరచెంచా బేకింగ్ సోడా కలపాలి

ఈ మిశ్రమంతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి

ఈ మిశ్రమం జిడ్డు చర్మం కలిగిన వారికి, మొటిమల సమస్యతో బాధపడే వారికి బాగా ఉపయోగపడుతుంది.

ముందుగా నిమ్మకాయంత సైజంత చింతపండును నాననివ్వాలి.చిక్కటి గుజ్జును తీసుకోని ముల్తానీ మట్టి,రోజ్‌వాటర్ కలపాలి

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా అప్లై చేసుకోవాలి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి

ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్‌లోనూ స్టోర్​ చేసుకోవచ్చు.

ఈ ఫేస్‌ప్యాక్ తరచూ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.