ఆహారం తిన్నాక ఎంత వేగంగా రక్తంలో చక్కెర పెరుగుతుందో చెప్పేదే గ్లైసిమిక్ ఇండెక్స్. ఒక్కో ఫుడ్‌కు ఒక్కో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

పుచ్చకాయల గ్లైసిమిక్ ఇండెక్స్ అధికం. ఇది తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

పైనాపిల్ తిన్న తరువాత వేగంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

అరటి పండు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.

మామిడి పళ్ల గ్లైసిమిక్ ఇండిక్స్ అధికం కావడంతో ఇది తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తక్షణ శక్తి లభిస్తుంది.

కర్బూజా పండు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అధికం

జీఐ ఎక్కువగా ఉన్న బొప్పాయి పండు తింటే వెంటనే రక్తంలో చక్కెరలు పెరుగుతాయి.

లిచ్చీ పళ్లకు కూడా ఇదే లక్షణం ఉంది.