నేరేడు పండులో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, సోడియం, విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.

నేరేడు పండును డయాబెటిస్‌ ఉన్నవారు తగిన మోతాదులో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. నేరేడు పండు తినడం వల్లే రక్తంలో షుగర్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందని భావించకూడదు.

ఇది డయాబెటిస్‌కు మందు కాదు. సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి.

నేరేడు పండులో ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్‌ వంటి బయో యాక్టివ్‌ సమ్మేళనాలు ఉంటాయి. 

ఇవి శరీరంలో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, వాపు వంటి ప్రక్రియలను తగ్గించడంలో సహాయపడవచ్చు.

అయితే.. డయాబెటిస్‌ ఉన్నవారు ఏ పండైనా పరిమిత మోతాదులోనే తీసుకోవడం ముఖ్యం.

నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. కానీ డయాబెటిస్‌కు ఇది మందు కాదు.