మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల  వల్ల చిన్న వయసులోనే  మధుమేహం బారిన పడుతున్నారు.

షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓ వైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహార నియమాలు పాటిస్తుంటారు.

చాలా మంది జొన్న రొట్టెలను తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు

అలవాటు లేని పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు

ముఖ్యంగా కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండానే కాలేయంలోకి చేరిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా ఫ్యాటీ లివర్ లాంటి జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు

అనవసరంగా ప్రయోగాలు చేసి అలవాటు లేని పదార్థాలు తీసుకుని ఇబ్బందులు పడవద్దని సలహా ఇస్తున్నారు

ఇలా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా షుగర్​ తగ్గినా దీర్ఘకాలంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

ఈ ఆహార ప్రయోగాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నారు.